రాత్రి 8.45 గంటల ఫ్లైట్‌లో కవితను ఢిల్లీకి తీసుకువెళ్లనున్న ఈడీ.. టిక్కెట్లు బుకింగ్ పూర్తి

     Written by : smtv Desk | Fri, Mar 15, 2024, 07:09 PM

 రాత్రి 8.45 గంటల ఫ్లైట్‌లో కవితను ఢిల్లీకి తీసుకువెళ్లనున్న ఈడీ.. టిక్కెట్లు బుకింగ్ పూర్తి

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు. ఆమెను హైదరాబాద్ నుండి ఢిల్లీకి తరలించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను నేటి రాత్రి 8.45 గంటల ఫ్లైట్‌లో టిక్కెట్లు బుక్ చేశారు. కవితను అరెస్ట్ చేసినట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ రోజు రాత్రి ఆమెను ఢిల్లీకి తరలించనున్నారు. కాసేపట్లో కవితను శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకు వెళ్లి.. అక్కడి నుంచి ఢిల్లీకి తరలిస్తారు.
ఈ కేసులో మరికొందరు బీఆర్ఎస్ నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కవిత అరెస్ట్ విషయం తెలిసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, భారత జాగృతి కార్యకర్తలు ఆమె నివాసానికి చేరుకున్నారు. ఈడీకి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవిత అరెస్ట్ విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఆమె నివాసానికి వచ్చారు.





Untitled Document
Advertisements