ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వియ్యంకురాలి హోటల్ లో ఐటీ రెయిడ్స్..

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 12:46 PM

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వియ్యంకురాలి హోటల్ లో  ఐటీ రెయిడ్స్..

హోటల్ ‘చట్నీస్’ హైదరాబాద్ లోని టాప్ బ్రాండ్ హోటల్స్ లో ఒకటి. అయితే ఈ హోటల్ లో మంగళవారం ఐటీ అధికారులు దాడులు జరిపారు. హోటల్ లో నేటి ఉదయం నుంచి సోదాలు జరుపుతున్నారు. అదేవిధంగా హోటల్ తో పాటు హోటల్ యజమాని అట్లూరి పద్మ నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, చట్నీస్ యజమాని అట్లూరి పద్మ వియ్యంకులు కావడం గమనార్హం. అట్లూరి పద్మ కుమార్తె వివాహం ఇటీవలే షర్మిల కొడుకు రాజారెడ్డితో ఘనంగా జరిగింది.
చట్నీస్ హోటల్స్ జంటనగరాల్లో బాగా పేరొందాయి. పదేళ్ల కిందట అట్లూరి పద్మ ఈ హోటల్ ను ప్రారంభించి, ప్రస్తుతం సిటీలో పలు బ్రాంచీలను ఏర్పాటు చేసి విజయవంతంగా నడిపిస్తున్నారు. తాజాగా జరుగుతున్న ఐటీ దాడుల వార్త వ్యాపార వర్గాల్లో సంచలనంగా మారింది. దీనిపై ఇటు చట్నీస్ యాజమాన్యం కానీ, ఐటీ అధికారులు కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువరించలేదు.

మరోవైపు, సిటీలోని మేఘనా ఫుడ్స్ అండ్ ఈటరీస్ లోనూ ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ తో పాటు బెంగళూరులోనూ మేఘనా ఫుడ్స్ కు ఫ్రాంచైజీలు ఉన్నాయి. చట్నీస్, మేఘనా ఫుడ్స్ లలో జరుగుతున్న సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సాయంత్రం ఐటీ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల ముంగిట జరుగుతున్న ఈ రైడ్స్ దెబ్బకు వ్యాపార వర్గాలలో కలకలం మొదలైంది.





Untitled Document
Advertisements