మద్యం కేసులో కస్టడీలో ఉన్న కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన ఈడీ

     Written by : smtv Desk | Tue, Mar 19, 2024, 06:51 PM

మద్యం కేసులో కస్టడీలో ఉన్న కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన ఈడీ

ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈడీ అధికారులు మంగళవారం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కేసులో కవితను నాలుగు రోజుల క్రితమే హైదరాబాద్ లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేసి.. దేశ రాజధానికి తీసుకువెళ్లారు. ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా.. ఈ నెల 23వ తేదీ వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఆమెను కోర్టులో హాజరుపరచడానికి ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెను కస్టడీకి తీసుకున్న తర్వాత ఈడీ అధికారులు ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కవిత పిటిషన్‌కు కోర్టు అనుమతి
తన కొడుకు, తల్లిని చూసేందుకు అనుమతివ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కవితకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతి ఇచ్చింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఎనిమిది మంది కలవడానికి కోర్టు అనుమతించింది. కోర్టు కవితను కలవడానికి అనుమతించిన వారిలో పిల్లలు, తల్లి శోభ, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.





Untitled Document
Advertisements