ఇటీవల కేంద్రం ప్రభుత్వం సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) అమల్లోకి తీసుకువచ్చిన విషయం విధితమే. అయితే కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. సీఏఏ అమలుపై స్టే ఇవ్వాలంటూ 230 పిటిషన్లు దాఖలు కాగా, సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది.
ఈ పిటిషన్లను సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ జేబీ పార్ధీవాలాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. సీఏఏ అమలుపై స్టే ఇచ్చేందుకు సీజేఐ బెంచ్ నిరాకరించింది. ఈ క్రమంలో, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
సీఏఏ వద్దంటూ దాఖలైన పిటిషన్లపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకు మూడు వారాల గడువు విధించింది. అనంతరం, తదుపరి విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. కేంద్రం ఏప్రిల్ 8వ తేదీ నాటికి వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. మరి కేంద్రం ఈ నోటీసుల పై ఏవిధంగా స్పందిస్తుంది అనేది చూడాలి.