స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దేవిశ్రీ ప్రసాద్

     Written by : smtv Desk | Wed, Mar 20, 2024, 11:55 AM

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దేవిశ్రీ ప్రసాద్

దేవీశ్రీ ప్రసాద్ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. టీనేజ్ లోనే దేవి సినిమాకు సంగీత దర్శకుడిగా మారాడు. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు తెలుగులో సైమా ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో అత్యధికంగా 11సార్లు నామినేటై, ఏడుసార్లు అవార్డును గెలుచుకున్నాడు. అంతే కాకుండా 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో పుష్ప (2021) సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడుగా ఎంపికయ్యారు . అవేకాకుండా డిఎస్పీ చేస్తోన్న సినిమాలలో ఒక్క ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప మిగిలినవన్నీ పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. పుష్ప 2 మూవీ లైన్ లో ఉండగా సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కంగువ రిలీజ్ కి సిద్ధం అవుతోంది.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ - కంగువ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఒకేసారి రావడంతో దేవిశ్రీప్రసాద్ పేరు ట్రేండింగ్ లోకి వచ్చింది. కంగువ టీజర్ ని పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఆదిమ తెగల మధ్య ఆధిపత్య పోరుగా కంగువ మూవీ ఉండబోతోందని టీజర్ బట్టి తెలుస్తోంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాలకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తూ ఉండటంతో ప్రత్యేకత ఏర్పడింది. కంగువా 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ. ఇక ఉస్తాద్ ప్యూర్ కమర్షియల్ జోనర్ లో పవర్ స్టార్ ఇమేజ్ బిల్డ్ చేసే యాక్షన్ మూవీగా రాబోతోంది. ఈ సినిమాల గ్లింప్స్ కు సంబంధించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పరంగా దేవి శ్రీ ప్రసాద్ అంత ఇంపాక్ట్ చూపించలేకపోయాడు అనే మాట వినిపిస్తోంది. పుష్ప సినిమా తర్వాత దేవిశ్రీ ప్రసాద్ నుంచి ఆడియన్స్ కి ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా దేవి కాస్తా వీక్ అనే టాక్ ఉండేది. అయితే రంగస్థలం, పుష్ప సినిమాలతో వాటికి ఫుల్ స్టాప్ పెట్టాడు. అయితే సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్స్ మాత్రం దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలకి తన బెస్ట్ అవుట్ పుట్ అందించాడని అంటున్నారు. అయితే ఆడియన్స్ ఎక్కువగా ఎక్స్ పెక్ట్ చేయడానికి ఆ అంచనాలు పూర్తిస్థాయిలో దేవిశ్రీ ప్రసాద్ అందుకోలేకపోయాడనే టాక్ నడుస్తోంది. అయితే టీజర్ కి, గ్లింప్స్ కి ఇచ్చిన మ్యూజిక్ కి సినిమా మొత్తం ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కి డిఫరెన్స్ ఉంటుందని, వీటిని చూసి ఒక అంచనాకు రాకూడదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సుకుమార్ సినిమాలకు మాత్రమే దేవి సరైన అవుట్ ఫుట్ ఇస్తాడానేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. సుకుమార్, దేవి లేకుండా ఇప్పటివరకు ఒక్క సినిమా చేయలేదు. రాజమౌళి - కీరవాణి ఆ తరువాత సుకుమార్ - దేవిశ్రీప్రసాద్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇవే బెస్ట్ కాంబినేషన్స్ అని చెప్పవచ్చు. అయితే దేవి శ్రీ ప్రసాద్ చేసే ఈ సినిమాల కు మ్యూజిక్ ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి మరి .
.







Untitled Document
Advertisements