శ్రీ విష్ణుకు ఆ సినిమాతో మరో హిట్టు గ్యారంటీ

     Written by : smtv Desk | Thu, Mar 21, 2024, 03:56 PM

శ్రీ విష్ణుకు ఆ సినిమాతో  మరో  హిట్టు గ్యారంటీ

వైవిధ్య కథలను ఎంచుకుంటూ, విలక్షణమైన నటనతో దూసుకెళ్తున్న హీరో శ్రీ విష్ణు. కథల పరంగా వైవిధ్యానికి ప్రాధాన్యమిచ్చే హీరో. ఈయన హీరోగా నటించిన భళా తందనాన చిత్రము సూపర్ హిట్ గా నిలిచింది . అందుకే ఆయన సినిమా వస్తుందంటే చాలు.. అటు సినీ అభిమానుల్లో, ఇటు సినీ వర్గాల్లో మంచి అంచనాలు ఉంటాయి. గతేడాది 'సామజవరగమన' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు 'ఓం భీమ్ బుష్' అంటూ ఒక డిఫరెంట్ నేమ్ ఉన్న కథతో అందరిని నవ్వించడానికి థియేటర్లలోకి వస్తున్నారు.
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ ''ఓం భీమ్ బుష్''. ఇందులో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ హీరోయిన్లుగా నటించారు. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, రేపు శుక్రవారం (మార్చి 22) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈరోజు గురువారం ఓవర్ సీస్ లో ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఇప్పటికే 'ఓం భీమ్ బుష్' చిత్రం నుంచి వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ టీజర్, ట్రెయిలర్.. 'జాతిరత్నాలు' తరువాత మళ్లీ అలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ముగ్గురు హీరోల ఎంటర్టైన్మెంట్ కథతో రాబోతోందనే అభిప్రాయాన్ని కలిగించాయి. చిత్ర బృందం సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీతో, అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తూ సినిమాని ఆల్రెడీ జనాల్లోకి తీసుకెళ్లారు. 'నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్' అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ''ఓం భీమ్ బుష్'' సినిమాలో ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని ఒక కొత్త పాయింట్ ను చెప్పబోతున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. ఆ పాయింట్ కు ఆడియన్స్ తప్పకుండా ఎంటర్టైన్ అవుతారని అంటున్నారు. రెండు గంటల పాటు నవ్వించడమే మెయిన్ టార్గెట్ గా పెట్టుకొని, ఒకే జోనర్ కి పరిమితం కాకుండా.. మిస్టరీ, థ్రిల్స్, కామెడీ ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉండేలా కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

బ్రోచేవారెవరురా' చిత్రంలో నవ్వులు పూయించిన శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ.. ఇప్పుడు "ఓం భీమ్ బుష్'' సినిమాతో మరోసారి సేమ్ మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నారని ఇన్సైడ్ టాక్. ఫస్ట్ హాఫ్ లో మూడు బ్లాకులు, సెకండ్ హాఫ్ లో రెండు బ్లాకులు హిలేరియస్ గా ఉంటాయని అంటున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే ఈ సినిమా మీద పెట్టిన పెట్టుబడికి మూడు రెట్లు లాభం వచ్చినట్లు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. 'ఓం భీమ్ బుష్' మూవీ సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గా వచ్చింది. దీనికి తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. పోటీలో మరో సినిమా లేదు కాబట్టి, బాక్సాఫీసు దగ్గర మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అవడం ఈ సినిమా లాంగ్ రన్ కు కలిసొచ్చే మరో అంశమని చెప్పాలి. చాలా రోజులుగా సరైన కామెడీ సినిమాల కోసం ఎదురు చూస్తున్న సినీ ప్రియులకు.. ఈ చిత్రం పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టెనర్ అవుతుందని చెప్పాలి. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు 'ఓం భీమ్ బుష్' చిత్రాన్ని నిర్మించారు. సన్నీ ఎంఆర్ సంగీతం సమకూర్చారు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. శ్రీకాంత్ రామిశెట్టి ఆర్ట్ డైరెక్టర్ గా, విజయ్ వర్ధన్ ఎడిటర్ గా వర్క్ చేసారు. రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో , సినిమా చుసిన వారు కడుపు నిండా నవ్వుకొని రావలసిన పరిస్థితి వస్తుందో చూడాలి మరి.






Untitled Document
Advertisements