బాలీవుడ్ లో ఎంఎస్ ధోనీ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నా అందాల ముద్దుగుమ్మ కియారా అద్వానీ. తెలుగులో కూడా తన నటన తో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈ అమ్మడు భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామ సినిమాలను చేసింది. అందులో ఒకటి హిట్ మరోటి ఫ్లాప్. ప్రస్తుతం రామ్ చరణ్ కి జోడీగా గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ లో ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. అక్కడ ఇక్కడ సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తాజాగా మరో సినిమా కమిట్ అయ్యిందట. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కి జోడీగా నటించేందుకు ఎంపిక అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.
యశ్ కొత్త సినిమా 'టాక్సిక్' లో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ నటించబోతుందనే వార్తలు వచ్చాయి. అవి పుకార్లే అని, తాజాగా కియారా అద్వానీతో టాక్సిక్ సినిమా యూనిట్ సభ్యులు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.ఈ మధ్య కాలంలో పెళ్లిచేసుకుంది . అయినా పెళ్లి తర్వాత కూడా కియారా అద్వానీ కి వరుసగా ఆఫర్లు రావడం, అది కూడా సౌత్ లో అవ్వడం విశేషం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సిద్దార్థ్ మల్హోత్ర ను వివాహం చేసుకున్న కియారా అద్వానీ పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోత చేస్తుంది. అందుకే వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. పెళ్లి అయినా పర్వాలేదు.. ఆమెతోనే తాము సినిమాలు చేయాలి అనుకుంటున్నాం అన్నట్లుగా హీరోలు ఆమెతో కమిట్ అవుతున్నారు. ఆమె అందచందాలతో హీరోలను మైమార్పించి ముందు ముందు మరిన్ని సినిమాలు తన బుట్టలో వేసుకునే ప్రయత్నాలు జోరుగానే కొనసాగుతున్నట్లు తెలుస్తుంది . అంతేకాకుండా హిందీ
తెలుగు అనే తేడా లేకుండా ఏ సినిమాల్లో అయినా నటించడానికి ఈ అమ్మడు సిద్దముగానే ఉన్నట్లు తెలుస్తుంది .