వనపర్తి, ఫిబ్రవరి 21 : వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో 8 మంది మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న ఓ కారు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ఎదురుగా వస్తున్న మరో కారుపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన క్షతగాత్రులను మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కార్లలో మొత్తం 11 మంది వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.