ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి.. వైసీపీ సోషల్ మీడియాకు గోరంట్ల హెచ్చరిక

     Written by : smtv Desk | Thu, Jun 06, 2024, 12:45 PM

ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి.. వైసీపీ సోషల్ మీడియాకు గోరంట్ల హెచ్చరిక

ఏపీ శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో టీడీపీపై దుష్ప్రచారం చేస్తోందని, వాటికి అడ్డుకట్ట వేయకుంటే చర్యలు తప్పవని టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్‌లో వైసీపీ ఎక్స్ ఖాతా నుంచి పోస్టు అయిన క్లిప్పింగ్‌ను షేర్ చేశారు.

చంద్రగిరి మండలం ఐతేపల్లి సమీపంలోని ఓ దాబా వద్ద వైసీపీ నాయకుడు, చంద్రగిరి పట్టణం వార్డు మెంబర్ వంశీపై టీడీపీ నాయకులు దాడిచేస్తున్నారంటూ వైసీపీ ఓ వీడియోను షేర్ చేసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన బుచ్చయ్య చౌదరి ఎక్స్‌లో స్పందించారు. అది ఫేక్ వీడియో అని, గంజాయి, జే-బ్రాండ్ తాగి ఓటమికి మీరంటే మీరు కారణం అంటూ వైసీపీ కార్యకర్తలు కొట్టుకుంటున్న వీడియో అదని పేర్కొన్నారు. దానిని టీడీపీ మీదకు నెట్టేందుకు వైసీపీ పేటీఎం బ్యాచ్ ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఫేక్ న్యూస్‌పై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీచేశారు.






Untitled Document
Advertisements