సూపర్-8లోకి భారత్ ఎంట్రీ.. ఇక పాక్ పరిస్థితి ఇదే!

     Written by : smtv Desk | Thu, Jun 13, 2024, 11:48 AM

 సూపర్-8లోకి భారత్ ఎంట్రీ.. ఇక పాక్ పరిస్థితి ఇదే!

క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్న టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా బుధవారం నాడు జరిగిన మ్యాచ్‌లో అమెరికాపై గెలుపొందిన భారతజట్టు సూపర్-8 దశలోకి అడుగుపెట్టింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచి గ్రాండ్‌గా నాకౌట్ దశలో స్థానం ఖరారు చేసుకుంది. గ్రూప్‌-ఏలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 6 పాయింట్లతో సూపర్-8కు అర్హత సాధించింది. అయితే భారత్ గెలుపుతో దాయాది దేశం పాకిస్థాన్ సూపర్-8 సమీకరణాలు ఆసక్తికరంగా మారియి. పాకిస్థాన్ కూడా నాకౌట్ దశకు క్వాలిఫై కావాలంటే ఈ నెల 14న జరగనున్న అమెరికా-ఐర్లాండ్‌ మ్యాచ్ ఫలితం కీలకం కానుంది.
ఐర్లాండ్‌పై మ్యాచ్‌లో అమెరికా ఓడిపోయి.. ఐర్లాండ్‌పై పాకిస్థాన్ గెలిస్తే 4 పాయింట్లతో దాయాది దేశం సూపర్-8లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఇరు జట్లకు సమానమైన పాయింట్లు ఉంటాయి కాబట్టి నెట్ రన్ రేట్ కూడా కీలకం అవుతుంది. ఒకవేళ ఐర్లాండ్‌పై అమెరికా గెలిస్తే 6 పాయింట్లతో తదుపరి దశలోకి ఎంటర్ అవుతుంది. ఈ సమీకరణంలో పాక్ టోర్నీ నుంచి నిష్ర్కమించాల్సి ఉంటుంది. ఏదేమైనా క్రీడాభిమానులు మాత్రం పాక్ విషయంలో ఎంతో ఆసక్తిగా ఉన్నారు.





Untitled Document
Advertisements