ఆంధ్రప్రదేశ్ సార్వత్రి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా పోటీ చేసి అఖండ విజయం సాధించి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం తనకు విషెస్ తెలిపిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కుమార స్వామికి పవన్ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. అలాగే తనకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, బీజేపీ నేత స్మృతి ఇరానీకి కూడా మంత్రి వపన్ కల్యాణ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు జనసేనాని ఎక్స్ (ట్విట్టర్) లో వరుస ట్వీట్లు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో పథంలో నడిపించేందుకు మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా పవన్ పేర్కొన్నారు.