డెల్టా రైతులకు బీజేపీ క్షమాపణ చెప్పాలి : ధూళిపాళ్ల

     Written by : smtv Desk | Thu, Mar 22, 2018, 06:01 PM

డెల్టా రైతులకు బీజేపీ క్షమాపణ చెప్పాలి : ధూళిపాళ్ల

అమరావతి, మార్చి 22 : బీజేపీ వ్యాఖ్యలు డెల్టా రైతులను అవమానపరిచే విధంగా ఉన్నాయని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. డెల్టా రైతాంగానికి బీజేపీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు పట్టిసీమపై చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యం అని అన్నారు.

రెండేళ్ళ తర్వాత పట్టిసీమపై విమర్శలు చేయడం సరికాదన్నారు. డెల్టా ప్రాంతం ఎడారిగా మారక ముందే చంద్రబాబు గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా తీసుకువచ్చారని తెలిపారు. పట్టిసీమ నుంచి డెల్టా ప్రాంతానికి ఇప్పటిదాకా 115 టీఎంసీల నీరు అందించినట్లు వెల్లడించారు.





Untitled Document
Advertisements