పాండ్యా కేసులో కీలక మలుపు..!

     Written by : smtv Desk | Thu, Mar 22, 2018, 06:20 PM

పాండ్యా కేసులో కీలక మలుపు..!

న్యూఢిల్లీ, మార్చి 22 : టీమిండియా క్రికెటర్, అల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని జోధ్‌పూర్ కోర్టు పోలీసుల‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. రాజ్యాంగ పిత అంబేద్కర్‌ను అవమానించేలా ట్వీట్‌ చేశాడంటూ ఆల్‌రౌండర్‌ హర్దిక్‌ పాండ్యాపై ఆరోపణలు ఉన్నాయి.

అయితే ఈ పోస్ట్ హర్దిక్‌ అఫీషియల్‌ అకౌంట్‌ నుండి ట్వీట్ కాలేదని తెలుస్తుంది. హర్దిక్‌ పాండ్యా అసలు ట్విట్టర్‌ అకౌంట్‌ యూజర్‌ నేమ్‌ @hardikpandya7 ఉండగా.. ఆ పోస్ట్‌ మాత్రం @sirhardik3777 పేరుతో ఉంది. పైగా పోస్ట్‌ చేసిన ఆ అకౌంట్ తొలిగించినట్లు సమాచారం.. ఈ నేపథ్యంలో అతనిపై కేసు వీగిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.





Untitled Document
Advertisements