న్యూయార్క్, ఏప్రిల్ 8:న్యూయార్క్ ట్రంప్ టవర్లోని 50వ అంతస్థులో శనివారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి గాయాలైనట్లు సమాచారం. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బందిసహాయక చర్యలు చేపట్టారు. హుటాహుటినా భవనంలోని వారిని ఖాళీ చేయించారు. అయితే ప్రమాదంలో 67 ఏళ్ల వృద్ధుడొకరు పొగ కారణంగా ఊపిరాడక స్పృహ కోల్పోగా.. ఆయన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని అధికారులు వెల్లడించారు. మరోవైపు సహయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది నలుగురు గాయపడినట్లు న్యూయార్క్ పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంపై డొనాల్డ్ ట్రంప్ తన ట్విటర్లో స్పందించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ..అగ్నిమాపక సిబ్బందికి ధన్యవాదాలు చెప్పారు
.