"మహానటి" టీజర్ కి బ్రహ్మరథం..

     Written by : smtv Desk | Sun, Apr 15, 2018, 12:01 PM


హైదరాబాద్, ఏప్రిల్ 15 : కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో "మహానటి" చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ విడుదలై 24 గంటలు గడవక ముందే ఇప్పటి వరకు 10 లక్షల మందికి పైగా చూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేసింది.

టీజర్ లో "అనగనగ ఒక మహానటి" అంటూ వచ్చే వాయిస్ ఓవర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌.., స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని మే 9 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, శాలినీ పాండే, ప్రకాష్ రాజ్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.





Untitled Document
Advertisements