17న మోత్కుపల్లి నర్సింహులు నామినేషన్

     Written by : smtv Desk | Sat, Nov 10, 2018, 12:04 PM

17న మోత్కుపల్లి నర్సింహులు నామినేషన్

యాదాద్రి, నవంబర్ 10: మోత్కుపల్లి నర్సింహులు బిఎల్ఎఫ్ అభ్యర్ధిగా ఆలేరు నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈనెల 17న నామినేషన్ పత్రాలు దాఖలు చేయబోతున్నట్లు ప్రకటించారు. తాను ప్రజల కోరిక మేరకే పోటీ చేస్తునందున తన నామినేషన్ దాఖలు కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తనకు మద్దతు తెలుపాలని విజ్ఞప్తి చేశారు.

తాను ఇదివరకే నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపానని, మళ్ళీ ఇప్పుడు తనను గెలిపిస్తే నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకువచ్చి ప్రజల పాదాలు కడిగి రుణం తీర్చుకొంటానని చెప్పారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలు తన పట్ల చూపుతున్న ఆధరణను చూస్తుంటే భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమనే నమ్మకం కలుగుతోందని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.





Untitled Document
Advertisements