జమ్ముకాశ్మీర్, ఫిబ్రవరి 19: కాశ్మీర్ లోని బారాముల్ల జిల్లాలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్ మెంట్ కు ఊహించని స్పందన లభించింది. ఆ జిల్లాలో ఖాళీగా ఉన్న 111 ఆర్మీ పోస్టులకు తాజాగా అధికారులు ఇంటర్వ్యూ నిర్వహించారు. పుల్వమా ఉగ్రదాడి తరువాత నిర్వహించిన ఈ ఇంటర్వ్యూకు యువకుతు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 111 పోస్టులకు వందల సంఖ్యలో హాజరుకావడంతో అధికారులు యువకులకు ముందుగా దేహాధారుడ్య పరీక్షలు నిర్వహించారు.
దేశ రక్షణ కోసం మేము సిద్ధంగా ఉన్నామని చాటిచెప్పారు కశ్మీర్ యువకులు. దేశాన్ని కాపాడేందుకు సరిహద్దులో పోరాడుతామని యువకులు ప్రకటించారు. ఆర్మీ అవకాశం ఇస్తే ఉగ్రవాడిలో అమరులైన కుటుంబాలకు మనోధైర్యం కలిగేలా, జాతి నిర్మాణం కోసం పాటుపడతామని ఇంటర్వ్యూకు హాజరైన బిలాల్ అహ్మద్ తెలిపారు.