ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆగస్టు నెలలో తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ అమెరికాలో పర్యటించనున్నారు. ఆగస్టు 17వ తేదీ నుంచి 23వ తేదీ మధ్య యూఎస్లో వైఎస్ జగన్ ఫ్యామిలీ పర్యటన కొనసాగనుండగా... డెట్రాయిట్లో ఎన్ఆర్ఐలు నిర్వహించే ఆత్మీయసభలో పాల్గొననున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాగా, ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ విదేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.