ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి గంటలో రుణం! ఎలాగో తెలుసా?

     Written by : smtv Desk | Fri, Oct 18, 2019, 10:00 AM

ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి గంటలో రుణం! ఎలాగో తెలుసా?

రుణం కోసం చూస్తున్నవారికి శుభవార్త. కేవలం గంటలోనే లోన్ పొందే సౌకార్యాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు అందిస్తున్నాయి. రుణ మంజూరీ ప్రక్రియను సరళతరం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక పోర్టల్‌ను ఆవిష్కరించింది. ఇందులోకి వెళ్లి లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.కేంద్ర ప్రభుత్వం తొలిగా ఈ సదుపాయాన్ని సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇతరులు కూడా రుణాలు పొందొచ్చు. ఎస్‌బీఐ లోన్స్ ఇన్ 59 మినిట్స్ స్కీమ్ ద్వారా లోన్ కావాల్సిన వారు రుణానికి 59 నిమిషాల్లోనే సూత్రప్రాయ ఆమోదం పొందొచ్చు.కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండానే హోమ్ లోన్ కోసం ఏకంగా రూ.10 కోట్ల వరకు రుణానికి ఆమోదం పొందొచ్చు. అర్హత కలిగన వారందరికీ ఈ ప్రయోజనం ఉంటుంది. లోన్ కావాలనుకునేవారు ఐటీఆర్, బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటి పలు వివరాలు అందిస్తే సరిపోతుంది. 59 నిమిషాల్లో అప్రూవల్ పొందొచ్చు.www.psbloansin59minutes.com వెబ్‌సైట్‌కు వెళ్లి హోమ్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు హోమ్ లోన్ పొందొచ్చు. ఉద్యోగులు ఐటీఆర్ 1 లేదా 2, ఇ-బ్యాంక్ స్టేట్‌మెంట్ సమర్పించాలి. అదే స్వయం ఉపాధి పొందుతున్నవారు ఐటీఆర్ 3 లేదా 4 అందించాల్సి ఉంటుంది.ఐటీఆర్ 1, 2, 4 ఫామ్స్‌ను పీడీఎఫ్ ఫార్మాట్‌లో, ఐటీఆర్ 3 ఫామ్‌ను ఎక్స్ఎంఎల్ ఫార్మాట్‌లో అందిచాల్సి ఉంటుంది. ఒకవేళ ఐటీఆర్ దాఖలు చేయకపోతే అప్పుడు ఆదాయానికి సంబంధించి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందించాలి.ఒకవేళ ఒక్కరి పేరు మీదనే కాకుండా ఇద్దరు కలిసి లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. అప్పుడు కోఅప్లికెంట్ ఐటీఆర్, బ్యాంక్ స్టేట్‌మెంట్ వివరాలను కూడా అందించాల్సి ఉంటుంది. కో అప్లికెంట్ ఉంటే రుణం సలభంగానే పొందొచ్చు.





Untitled Document
Advertisements