స్టాక్ మార్కెట్‌కు లాభాల ముగింపు!

     Written by : smtv Desk | Thu, Dec 12, 2019, 05:36 PM

స్టాక్ మార్కెట్‌కు లాభాల ముగింపు!

దేశీ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు కూడా దూసుకెళ్లాయి. బ్యాంక్, ఆటో, మెటల్ షేర్ల దన్నుతో గురువారం మార్కెట్‌ లాభాల్లోనే క్లోజయ్యింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వపు దివాలా చట్టం (ఐబీసీ) సవరణలు ఇన్వెస్టర్లను మెప్పించాయి.సెన్సెక్స్ ఇంట్రాడేలో 300 పాయింట్ల మేర పరుగులు పెట్టింది. నిఫ్టీ కూడా 12,000 పాయింట్ల స్థాయిని మళ్లీ అందుకుంది. అయితే సూచీలు చివరి వరకు ఇదే జోరు కొనసాగించలేకపోయాయి. సెన్సెక్స్ 169 పాయింట్ల లాభంతో 40,582 పాయింట్ల వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 11,972 వద్ద క్లోజయ్యాయి. నిఫ్టీ 50లో టాటా మోటార్స్, యస్ బ్యాంక్, వేదాంత, టాటా స్టీల్, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్ దాదాపు 7 శాతం పెరిగింది.అదేసమయంలో ఇన్ఫోసిస్, టీసీఎస్, ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టపోయాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు 2 శాతం పడిపోయాయి.నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. ఒక్క నిఫ్టీ ఐటీ మినహా ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1 శాతానికి పైగా పడిపోయింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ మెటల్ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా పెరిగాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఆటో ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా లాభపడ్డాయి.





Untitled Document
Advertisements