మూడో టీ20‌: హామిల్టన్ చేరుకున్న కోహ్లీసేన

     Written by : smtv Desk | Mon, Jan 27, 2020, 08:10 PM

మూడో టీ20‌: హామిల్టన్ చేరుకున్న కోహ్లీసేన

న్యూజిలాండ్‌తో మూడో టీ20‌లో తలపడేందుకు భారత్ జట్టు ఈరోజు హామిల్టన్‌కి చేరుకుంది. ఆక్లాండ్ వేదికగా గత శుక్ర, ఆదివారం వరుసగా రెండు టీ20ల్లో ఢీకొట్టిన టీమిండియా.. 6, 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక మూడో టీ20 మ్యాచ్ హామిల్టన్ వేదికగా బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి జరగనుంది. ఐదు టీ20ల ఈ సిరీస్‌లో ఇప్పటికే వరుసగా రెండు టీ20ల్లోనూ గెలుపొందిన భారత్ జట్టు ప్రస్తుతం 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక మూడో టీ20లోనూ గెలిచి న్యూజిలాండ్ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్‌ని కైవసం చేసుకోవాలని కోహ్లీసేన ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు సొంతగడ్డపై కనీసం మూడో టీ20లోనైనా గెలిచి సిరీస్‌ ఆశలు నిలుపుకోవాలని కివీస్ కూడా ఆశిస్తోంది. దీంతో.. ఈ మ్యాచ్‌ ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది. తొలి టీ20లో 203 పరుగులతో సత్తాచాటిన న్యూజిలాండ్ టీమ్.. రెండో టీ20 మాత్రం 132/5కే పరిమితమైంది. మరోవైపు 204 పరుగుల లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన టీమిండియా.. 133 రన్స్ టార్గెట్‌ని 17.3 ఓవర్లలోనే 135/3తో ఛేదించింది. ఇక బౌలింగ్‌లోనూ కివీస్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదుకాలేదు. ఈ నేపథ్యంలో.. కనీసం మూడో టీ20లోనైనా తప్పిదాల్ని దిద్దుకోవాలని ఆతిథ్య టీమ్ ఆశిస్తోంది.

View this post on Instagram

And, we are here Hamilton #TeamIndia #NZvIND

A post shared by Team India (@indiancricketteam) on






Untitled Document
Advertisements