న్యూఢిల్లీ, జనవరి 26: దేశంలో ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికల సమరం జరిగితే 40 శాతం ఓట్లతో మోదీ హయంలోని ఎన్డీఏ కూటమి 258 సీట్లు సాధిస్తుందని ఇండియా టుడే– కార్వీ ఒపీనియన్ పోల్లో వెల్లడైంది. మొత్తం 543 సీట్లకు గాను కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి 38 శాతం ఓట్లతో 202 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది. ఇతర పార్టీలు 22 శాతం ఓట్లతో 83 సీట్లు సొంతం చేసుకుంటాయి.
ఇండియా టుడే పోల్ సర్వే ప్రకారం.. తర్వాత ప్రధానిగా 53 శాతం ఓట్లతో మోదీ తొలి స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి 22 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. స్వాతంత్య్రం అనంతరం దేశంలో అత్యుత్తమ ప్రధానిగా మోదీకి 28 శాతం, ఇందిరా గాంధీకి 10 శాతం, అటల్ బిహారి వాజ్పేయికి 10 శాతం, నెహ్రూకు 8 శాతం మంది తమ మద్దతు వెల్లడించారు.