మెగాస్టార్ కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్నసినిమా 'విశ్వంభర' శరవేగంగా షూటింగ్ పనులు అవుతున్న విషయమ అందరికి తెలిసిందే . బ్లాక్బస్టర్ బింబిసార సినిమా ఫేం తో వశిష్ట చేయబోయే ద్వితీయ సినిమాకె చిరంజీవి లాంటి పెద్ద స్టార్ ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని పొందాడు. ప్రతిభావంతుడైన దర్శకుడు మెగాస్టార్ను లార్జర్ దేన్ లైఫ్ పాత్రలో తెరపై ఆవిష్కరించనున్నారు. దీనికోసం అద్భుతమైన సోషియో ఫాంటసీ కథను సిద్ధం చేశాడు. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ గా త్రిష కృష్ణన్ . ఇటీవలే కొన్ని టాకీ పార్ట్లు, ఒక పాట, ఒక యాక్షన్ బ్లాక్ని చిత్రీకరించగా షెడ్యూల్ పూర్తయింది. ఇటీవల హైదరాబాద్లో కీలకమైన యాక్షన్ షెడ్యూల్ను ప్రారంభించారు
ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో హైదరాబాద్ అల్లుమియం ఫ్యాక్టరీలో చిరంజీవి సహా కొంతమంది ఫైటర్స్పై హై-ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఫైట్ సీక్వెన్స్ను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు. కీలకమైన దశలో వచ్చే ఈ ప్రత్యేక యాక్షన్ సీక్వెన్స్ వీక్షకులను మెస్మరైజ్ చేయనుంది. విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్ కోసం టాప్ రేంజ్ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఈ సినిమా అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలను కలిగి ఉంటుంది. ఇటీవల ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, శ్రీ శివశక్తి దత్తా- చంద్రబోస్ గీత రచయితలు. మొత్తానికి ఈ సినిమాను 2025 సంక్రాంతి నాటికీ కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలి అనే ఉదేశ్యంలో ఉన్నట్లు తెలుస్తుంది . మెగాస్టార్ ఫ్యాన్స్ ఇంకా ఆయన సినిమా కోసం ఒక సంవత్సరం పాటు వెయిట్ చేయక తప్పదు .