ఒకవైపు వేసవి సెలవులు మరోవైపు కొనసాగుతున్న ఐపీఎల్ సీజన్. మండే ఎండల్లో తమకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ఆటతో సేద తీరుతున్న క్రీడాభిమానులు అనేకం. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో మన తెలుగు క్రీడాభిమానుల ఫేవరేట్ జట్టు
సన్రైజర్స్ హైదారబాద్ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచుల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇక తన తరువాతి మ్యాచ్ను హైదరాబాద్ గురువారం రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. సొంతమైదానం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజగా గచ్చిబౌలిలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో సన్ రైజర్స్ క్రికెటర్లు సందడి చేశారు. జయదేవ్ ఉనద్కత్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, టీ. నటరాజన్, అబ్దుల్ సమద్లు మాల్లో షాపింగ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో షాపింగ్ మాల్కు తరలివచ్చారు. ఈ సందర్భంగా తమ అభిమాన ఆటగాళ్లతో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. క్రీడాకారులు సైతం తమ ఫ్యాన్స్ తో ఫోటోలకు పోజులిచ్చి తమ అభిమానులను సంతోషపెట్టారు.
https://www.instagram.com/reel/C6Y2dnGJyGA/?utm_source=ig_web_copy_link