భార్య పై ఉన్న గౌరవంగా శ్రీదేవి బయోపిక్ చేయను అంటున్న బోనీ క‌పూర్

     Written by : smtv Desk | Thu, Apr 04, 2024, 03:26 PM

భార్య పై ఉన్న గౌరవంగా శ్రీదేవి బయోపిక్ చేయను అంటున్న బోనీ క‌పూర్

ఈ మధ్య కాలంలో ఎక్కువగా బయోపిక్ తో సినిమాలు చేస్తున్నారు . అలనాటి మహానటి సావిత్రి గురించి , సీనియర్ ఎన్టీఆర్ గురించి తీసిన విషయమ అందరికి తెలిసిందే . అదే కోవలో అందాల తార శ్రీదేవి బయోపిక్‌ కూడా ఠెసె అవకాశము ఉందా ? అనే విషయమ గురించి శ్రీదేవి భర్త బోనీ క‌పూర్ ను ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో అత‌డి దివంగత భార్య శ్రీదేవి జీవిత‌క‌థ‌ ఆధారంగా బయోపిక్ తెర‌కెక్కే అవకాశం ఉందా? అని మీడియా త‌న‌ను ప్ర‌శ్నించింది. ఈ బయోపిక్ తీసే ఉద్దేశం తనకు లేదని, ఎవరినీ అనుమతించబోనని కూడా బోనీ క‌పూర్ త‌డుముకోకుండా స‌మాధాన‌మిచ్చారు.

శ్రీ‌దేవిపై త‌న‌కు ఉన్న‌ గౌరవం కార‌ణంగా బ‌యోపిక్ చేయ‌న‌ని బోనీ అన్నారు. శ్రీ‌దేవి చాలా ప్రైవేట్ వ్యక్తి. త‌న‌ జీవితం ప్రైవేట్‌గా ఉండాలి నేను జీవించి ఉన్నంత‌ వరకు ఇది జరగడానికి నేను అనుమతించను అని ఆయన చాలా కఠినంగా అన్నారు. భారతదేశపు తొలి మహిళా సూపర్‌స్టార్‌గా శ్రీదేవి కీర్తినందుకున్నారు. త‌న‌దైన అద్భుత న‌ట‌న‌, అభిన‌యంతో ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ద‌శాబ్ధాల పాటు న‌టిగా శ్రీ‌దేవి అల‌రించారు. దక్షిణ భారత సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన శ్రీ‌దే వి అక్కడి నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి బహుముఖ పాత్రలతో ప్రేక్షకులను అలరించింది.అంతేకాకుండా నాలుగు దశాబ్దాల కెరీర్ లో 300 పైగా చిత్రాలకు పనిచేశారు. ఇటు తెలుగు లో -అటు త‌మిళం లో -ఇంకా హిందీలో అగ్ర నాయిక కీర్తిని అందుకున్నారు. 2018 లో శ్రీ‌దేవి అకాల మరణం అభిమానుల‌కు షాకిచ్చింది. ఇంగ్లీష్ వింగ్లీష్ శ్రీ‌దేవి న‌టించిన చివరి బాలీవుడ్ చిత్రం. శశి గాడ్‌బోలే పాత్రకు ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. తాను జీవించి ఉన్నంత వరకు శ్రీదేవి బయోపిక్‌ రాదని బోనీ కపూర్‌ గట్టి సమాధానం ఇవ్వ‌డాన్ని బ‌ట్టి ఇప్ప‌ట్లో ఈ బ‌యోపిక్ చూసే అవ‌కాశం లేద‌ని అర్థ‌మ‌వుతోంది. 1996లో శ్రీదేవిని బోనీక‌పూర్ వివాహం చేసుకున్నాడు. శ్రీ‌దేవి 2018లో మరణించారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జాన్వీ కపూర్ - ఖుషీ కపూర్ క‌థానాయిక‌లుగా సుప‌రిచితులు.దీన్ని బట్టి ప్రేక్షకులకు శ్రీదేవి జీవితంలో జరిగిన విషయాలు తెలుసుకోవడం కష్టమే .





Untitled Document
Advertisements