ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ టాలీవుడ్ లో పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. దాని తర్వాత బన్నీ చేయబోయే తదుపరి సినిమాలపై అన్ని భాషల ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఇటు సౌత్ ప్రేక్షకులతో పాటు అటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా పుష్ప 2 కోసం ఏ విధంగా ఎదురు చూస్తున్నారో చెప్పనక్కర్లేదు.
ఇటీవల అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబో లో మరో మూవీ కన్ఫర్మ్ అయ్యింది. దీని గురించి పూర్తి వివరాలతో అధికారికంగా ప్రకటన ఏ క్షణంలో అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్ లో అట్లీ జవాన్ తో స్టార్ గా మారి పోయాడు. అందుకే ఆయన సినిమా అన్నా కూడా హిందీ ప్రేక్షకులు చెవ్వు కోసుకునే రేంజ్ లో ఎదురు చూస్తున్నారు.
అందుకే వీరి సినిమా వార్తలు వచ్చినప్పటి నుంచే ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందో , ఎప్పుడు విడుదల అవుతుందో అనే ఆసక్తి అందరిలో కూడా కనిపిస్తుంది. ఇక ఈ కాంబో హీరోయిన్ విషయంలో షాకింగ్ పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అట్లీ మొదట ఈ సినిమా కోసం త్రిష ను అనుకున్నాడు. అల్లు అర్జున్ కి జోడీగా త్రిష ఏంటి అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో అట్లీ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. త్రిష స్థానంలో మరొక స్టార్ హీరోయిన్ సమంత ను ఎంపిక చేసే అవకాశాలు చాలనే ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.
ఏడాది బ్రేక్ తీసుకున్న సమంత తిరిగి షూటింగ్స్ కు హాజరు అయ్యేందుకు రెడీ అవుతుంది. మొదట హిందీ సినిమా చేయాలని భావిస్తున్న సమంత త్వరలోనే అల్లు అర్జున్ కు జోడీగా అట్లీ దర్శకత్వంలో సినిమా ను చేసేందుకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. పుష్ప లో ఊ అంటావా పాటలో బన్నీ మరియు సామ్ ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ కి అంతా కూడా ఫిదా అయ్యారు. అంతే కాకుండా సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా వీరిద్దరు కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించారు. కనుక మళ్ళి వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా మళ్ళి ఒక రేంజ్ లో హిట్ అవుతుంది అని గట్టిగ నముతున్నారు . అంటే వీరి కాంబినేషన్ కూడా ప్రేక్షకులకు ఆ విధంగా నచ్చింది .