ముంబై, ఏప్రిల్ 30 : 'హిట్ మ్యాన్'.. అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రోహిత్ శర్మ. క్రికెట్ లో కొంత మందికి గొప్ప టైమింగ్ ఉంటుంది. దాంతోనే షాట్ లు కొడతారు. మరి కొంత మందికి బలం ఉంటుంది. గట్టిగా బాదుతారు. ఈ రెండు కలగలిసిన వీరుడే రోహిత్ శర్మ. ఈ రోజు రోహిత్ శర్మ ఈ రోజు(ఏప్రిల్ 30) 31వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లు, సీనియర్లు, అభిమానుల నుంచి రోహిత్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
క్రికెట్ చరిత్రలో వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) చేసిన ఘనత కూడా ఈ కుడిచేతి వాటం బ్యాట్స్మెన్కే దక్కింది. టెస్ట్, వన్డే, టీ20 ఇలా మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ రెండుసార్లు జట్టును విజేతగా నిలిపాడు.