బిహార్‌లో బస్సు బోల్తా.. 27 మంది మృతి

     Written by : smtv Desk | Thu, May 03, 2018, 05:50 PM

బిహార్‌లో బస్సు బోల్తా..  27 మంది మృతి

పట్నా, మే 3 : బిహార్‌లో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. మోతీహరి ప్రాంతంలో ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దాంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 27మంది ప్రయాణికులు సజీవదహనమైనట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, రక్షణ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. స్థానికులు కూడా వారికి సాయపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





Untitled Document
Advertisements