హైదరాబాద్, మే 21 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన "నా పేరు సూర్య" సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే రాబట్టింది. వక్క౦తం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
అయితే నిత్యం షూటింగ్ లతో బిజీగా ఉండే స్టైలిష్ స్టార్.. ఏ మాత్రం సమయం దొరికిన కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ప్రాధాన్యతనిస్తారు. వీలు చిక్కినప్పుడల్లా భార్యా పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేస్తారు. తాజాగా బన్ని, స్నేహల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రస్తుతం బన్నీ స్నేహతో కలసి ముంబైలో ఉన్నాడు. ఆమెతో కలిసి ముంబైలోని ఓ రెస్టారెంట్కు డిన్నర్ కోసం వచ్చిన బన్ని దంపతులు.. డిన్నర్ ముగించి బయటకు వస్తున్న సమయంలో మీడియా కంటికి చిక్కారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి.