అతిలోకసుందరికి అరుదైన కానుక..

     Written by : smtv Desk | Wed, May 23, 2018, 06:17 PM

అతిలోకసుందరికి అరుదైన కానుక..

హైదరాబాద్, మే 23 : అతిలోకసుందరి.. దివంగత నటి శ్రీదేవికి అభిమానులు ఏ స్థాయిలో ఉంటారో ప్రత్యేక౦గా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవిదేశాల్లో ఆమెకు అభిమానులు ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా కొంతమంది అభిమానులు పెయింటింగ్ వేసి నివాళులు అర్పించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పుణెకు చెందిన ముగ్గురు అమ్మాయిలు తమ అభిమాన తార కోసం వినూత్నంగా నివాళులర్పించారు.

ఇటీవల హోండాసిటీ కారును కొనుగోలు చేసిన వారు.. ఆ కారు చుట్టూ శ్రీదేవి చిన్నప్పటి నుంచి నటించిన సినిమాల్లోని వివిధ గెటప్‌లను డిజైన్‌ చేయించారు. కారు బానెట్‌పై శ్రీదేవి నటించిన "మామ్‌" సినిమా పోస్టర్‌ను డిజైన్‌ చేయించి దానిపై ఆ సినిమాలోని డైలాగ్‌ను ప్రింట్‌ చేయించారు.

అయితే ఈ కారు గురించి తెలుసుకుని శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ ఆ ముగ్గురు యువతుల్ని ఇంటికి ఆహ్వానించారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా ఆ యువతులు మాట్లాడుతూ.. "బోనీజీ మమ్మల్ని తమ ఇంటికి ఆహ్వానించినప్పుడు ఎంతో సంతోషించాం. దాదాపు 40 నిమిషాలు బోనీతో సమావేశమయ్యాం. భోజనం చేసి వెళ్లమన్నారు. కానీ సమయం లేకపోవడంతో కాఫీ తాగి వచ్చేశాం" అని పేర్కొన్నారు.





Untitled Document
Advertisements