'అర్జున్ రెడ్డి'తో అను ఇమ్మాన్యుయేల్..!!

     Written by : smtv Desk | Thu, May 24, 2018, 06:47 PM

'అర్జున్ రెడ్డి'తో అను ఇమ్మాన్యుయేల్..!!

హైదరాబాద్, మే 24 : సినీ కెరీర్ ప్రారంభంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది "మజ్నూ" భామ అను ఇమ్మాన్యుయేల్. ఆ తర్వాత అల్లు అర్జున్ తో కలిసి 'నా పేరు సూర్య' అంటూ సందడి చేసింది. ఇలా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామ ఒక చిన్న అతిథి పాత్రలో మెరవనుందట. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ ఒక సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న కథానాయిక అయితే బాగుంటుందని దర్శకుడు ఆలోచించారట. దీంతో అను ఇమ్మాన్యుయేల్ అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న మూవీ కాబట్టి ఆమె ఒకే చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం అను ఇమ్మాన్యుయేల్ "శైలజా రెడ్డి అల్లుడు" అనే సినిమాలో నటిస్తోంది.





Untitled Document
Advertisements