హైదరాబాద్, మే 26 : 'బాహుబలి' లాంటి ఘనవిజయం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'సాహో'. 'రన్ రాజా రన్' ఫేం సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇటీవల దుబాయ్లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సాహో టీం ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంది. దుబాయ్ షెడ్యూల్లో భారీ యాక్షన్, చేజ్ సీన్స్ను భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. ఇప్పుడు సాహో యూనిట్ జూన్ రెండో వారంలో మరో షెడ్యూల్ను ప్రారంభించేందుకు రెడీ అవుతుంది.
ఈ షెడ్యూల్ను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించనున్నారు. బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావటంతో 'సాహో' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగా చిత్రయూనిట్ ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్,చుంకీ పాండే, మందిరా బేడిలు కీలక పాత్రల్లో పోషిస్తున్నారు.