హైదరాబాద్, మే 26 : గత కొన్ని రోజులుగా కేరళను వణికిస్తున్న ప్రమాదకర నిఫా వైరస్ హైదరాబాద్ వాసులకు సోకిందన్న వార్త తీవ్ర కలకలం సృష్టించింది. ఈ మేరకు స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి.. రాష్ట్రంలో నిఫా వైరస్ లేదని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. అనుమాన౦ ఉన్న ఇద్దరు వ్యక్తుల శాంపిల్స్ పుణేకు పంపామన్నారు. కానీ ఆ ఇద్దరి బ్లడ్ శాంపుల్స్లో వైరస్ లేదని రుజువైందని వివరించారు.
ఒకరు టైఫాయిడ్ తో, మరొకరు మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని.. అంతేగాని వారికి నిఫా వైరస్ సోకలేదని వెల్లడించారు. కాని ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న కేరళలోని పలు ప్రాంతాల్లో పర్యటించకపోవడమే మంచిదని హెచ్చరించారు. ఒకవేళ ఈ వైరస్ సోకినట్లుగా అనుమానం ఉంటే బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి టెస్టులు చేయించుకోవాలన్నారు. మరోవైపు ప్రభుత్వం సైతం జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు చెబుతోంది. కాగా కేరళలో ఇప్పటికే నిఫా వైరస్ సోకి 12 మరణాలు సంభవించగా, పలు కేసులు నమోదయ్యాయి.