ముంబై, జూన్ 10 : ఇండియన్ ఫుట్బాల్ జట్టు చివరి పోరుకు సిద్ధమైంది. ఇంటర్కాంటినెంటల్ కప్లో భాగంగా ఆదివారం ఫైనల్లో కెన్యాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో భారత్ను ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ సునీల్ ఛెత్రిపైనే జట్టు మరోసారి ఆశలు పెట్టుకుంది. లీగ్ దశలో కెన్యాను 3-0తో ఓడించడం భారత్కు అతిపెద్ద సానూకులంశం. ఆ మ్యాచ్లో రెండు గోల్స్తో ఛెత్రి జట్టుకు గెలుపును అందించాడు. లీగ్ దశల్ కెన్యాపై గెలిచినా కూడా ఆ జట్టును తక్కువగా తీసుకోవడానికి వీల్లేదని కోచ్ స్టీఫెన్ అంటున్నాడు. ఈ మ్యాచ్కు పూర్తిస్థాయి జట్టుతో బరిలో దిగనున్నామని ఆయన వెల్లడించాడు.
ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్ల్లో 6 గోల్స్తో తిరుగులేని ఫామ్లో ఉన్న కెప్టెన్ చెత్రితో పాటు మరో స్ట్రయికర్ జెజే లాల్పెక్లువా ఈ మ్యాచ్లోనూ కీలకం కానున్నారు. చివరి లీగ్ మ్యాచ్లో కెన్యా 4–0తో చైనీస్ తైపీపై విజయం సాధించి... న్యూజిలాండ్ను వెనక్కు నెట్టి ఫైనల్కు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సమరం ఆసక్తికరంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.