జియో 'డబుల్' ధమాకా..

     Written by : smtv Desk | Wed, Jun 13, 2018, 04:32 PM

జియో 'డబుల్' ధమాకా..

హైదరాబాద్, జూన్ 13 : రిలయన్స్ జియో తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వినియోగదారులకు అదనంగా 1.5 జిబి డేటాను ఆఫర్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. 149 రూపాయల నుంచి 499 రూపాయల శ్రేణిలో గల అన్ని ప్రీ పెయిడ్‌ ప్లాన్లలోని వినియోగదారులకు ఈ ప్లాన్ అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం 149, రూపాయలు, 349 రూపాయలు, 399 రూపాయలు, 449 రూపాయల ప్యాక్‌లోని వినియోగదారులకు రోజుకు 1.5 జిబి డేటాను అందిస్తుండగా కొత్త ఆఫర్‌లో భాగంగా రోజుకు 3 జిబి డేటాను అందుకోనున్నారని వెల్లడించింది.

అలాగే రూ.198, రూ.398, రూ.448, రూ.498 రీఛార్జి చేసుకుంటే ఇప్పటి వరకు రోజుకు 2జీబీ డేటాను మాత్రమే పొందగలుగుతున్నారు. ఇక మీదట 3.5జీబీ డేటాను పొందవచ్చు. ఇక రూ.299, రూ.509, రూ.799తో రీఛార్జి చేసుకుంటే వరుసగా రోజుకు 4.5జీబీ, 5.5జీబీ, 6.5జీబీ డేటాను వినియోగదారులు పొందవచ్చు. అంతేకాకుండా మై జియో యాప్‌ ద్వారా 300 రూపాయలకు పైబడిన అన్ని రీచార్జ్‌లకు 100 రూపాయలు తగ్గించటమే కాకుండా 300 రూపాయల లోపు ఉన్న ప్లాన్‌లోని వినియోగదారులకు 20 శాతానికి పైగా డిస్కౌంట్‌ను ఇస్తోంది. ఈ ఆఫర్‌ ఈ నెల 12 నుంచి 30 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని రిలయన్స్‌ జియో వెల్లడించింది.





Untitled Document
Advertisements