గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మహేష్..??

     Written by : smtv Desk | Fri, Jun 22, 2018, 12:27 PM

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మహేష్..??

హైదరాబాద్, జూన్ 22 : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 'డార్జిలింగ్' లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఓ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నారట.

తాజాగా వీరిద్దరు కలిసి ఇదే విషయంపై కాసేపు మాట్లాడుకున్నట్లు సమాచారం. మహేష్ తో సినిమా చేయాలనే ఉద్దేశ్యాన్ని అల్లు అరవింద్ తెలియపరిచారట. దీనికి మహేష్ కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. ఎక్కువగా మెగా హీరోలతోనే సినిమాలు ప్లాన్ చేసే అల్లు అరవింద్, మహేశ్ బాబుతో సినిమా ప్లాన్ చేయడమే ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.





Untitled Document
Advertisements