చెన్నై, జూన్ 22 : తెలుగు, తమిళ భాషల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు సూర్య.. తాజాగా కేవీ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో నటించనున్నారు. మలయాళ నటుడు మోహన్లాల్, తెలుగు కథానాయకుడు అల్లు శిరీష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ బాణీలు అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కథానాయిక ఎవరన్న విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది.
ఈ చిత్రంలో సూర్యకు జోడీగా అఖిల్ హీరోయిన్ సాయేషా సైగల్ నటించనుందట. ఈ మేరకు సాయేషా.. ఆనందం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో.. "డైనమిక్ నటుడు సూర్య, మోహన్లాల్, శిరీష్తో కలిసి వెండితెరను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. లండన్లో కలుద్దాం. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి" అని ట్వీట్ చేశారు. కాగా సాయేషా.. సూర్య సోదరుడు కార్తీకి జంటగా నటించిన 'చినబాబు' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.