మల్టీస్టారర్ మొదలైంది..!

     Written by : smtv Desk | Sat, Jun 23, 2018, 12:45 PM

మల్టీస్టారర్ మొదలైంది..!

హైదరాబాద్, జూన్ 23 : విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’అనే ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ రోజు లాంఛనంగా ప్రారంభం అయ్యింది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా ముహూర్తపు షాట్ చిత్రీకరణ జరిగింది. దేవుడి పటాలపై తొలి షాట్‌ను చిత్రీకరించారు. అల్లు అరవింద్ క్లాప్ కొట్టడంతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. వెంకీ సరసన తమన్నా హీరోయిన్‌ గా నటిస్తుండగా, వరుణ్‌ సరసన మెహరీన్‌ హీరోయిన్‌ గా నటిస్తున్నారు. మ్యూజిక్‌ సెన్సేషన్ దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు. వెంకటేష్ వంటి సీనియర్, వరుణ్ తేజ్ వంటి జూనియర్ కాంబోలో రూపొందుతున్న సినిమా కావడంతో ఇది క్రేజీ కాంబోగా నిలుస్తోంది. ఎంటర్‌టైనర్లను తీయడంలో అనిల్ రావిపూడి సత్తా ఏమిటో ఇప్పటికే బయటపడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కూడా మంచి ఎంటర్‌టైనర్ అవుతుందనే అంచనాలున్నాయి.





Untitled Document
Advertisements