'మూవీ మొఘల్‌' పై బయోపిక్ లేదు..

     Written by : smtv Desk | Sat, Jun 23, 2018, 01:14 PM

'మూవీ మొఘల్‌' పై బయోపిక్ లేదు..

హైదరాబాద్, జూన్ 23 : ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడిపై బయోపిక్ తెరకెక్కించే ఉద్దేశం లేదని ఆయన కుమారుడు, నిర్మాత డి.సురేశ్‌బాబు స్పష్టం చేశారు. సురేశ్‌ బాబు నిర్మాణంలో తరుణ్ భాస్కర్ రూపొందించిన సినిమా "ఈ నగరానికి ఏమైంది". విశ్వక్ సేన్, సాయి సుశాంత్, వెంకట్ కాకమాను, అభినవ్ గోమతం, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సురేశ్ బాబు మీడియాతో మాట్లాడారు.

ఈ నగరానికి ఏమైంది' షూటింగ్ జరుగుతున్నప్పుడు రెండుసార్లు సెట్స్‌కి వెళ్లా. అంతా సరిగానే సాగుతున్నట్టు గుర్తించానన్నారు. తమ బ్యానర్ లో వచ్చిన సినిమాల్లో కొత్త వారిని, కొత్త ట్యాలెంట్‌ను పరిచయం చేస్తామని, ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్‌ను మరింత నాణ్యంగా తీర్చిదిద్దుతామని అన్నారు. అదే విధంగా బయోపిక్ ల గురించి మాట్లాడుతూ.. 'మహానటి', 'సంజు' వంటి బయోపిక్ లలో వారివారి జీవితాలలో పలు కోణాలను చవిచూశారని పేర్కొన్నారు. కాని తన తండ్రి జీవితం అలా కాదని, కథలో కాంట్రవర్సీ లేకపోతే ఎవరూ చూడరని వివరించారు. ఇప్పటికైతే తన తండ్రి రామానాయుడి బయోపిక్‌ను తెరకెక్కించాలన్న ఆలోచన లేదంటూ చెప్పుకొచ్చారు.





Untitled Document
Advertisements