హైదరాబాద్, జూన్ 23 : గత రెండు మూడేళ్ళుగా సాలిడ్ హిట్ లేని యువ హీరో ఆది సాయి కుమార్ .. ఈ ఏడాది రెండు కొత్త ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ఒకటి నూతన దర్శకుడు శ్రీనివాస్ నాయుడు దర్శకత్వంలో శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్పై.. చింతలపూడి శ్రీనివాస్ , చావలి రామాంజనేయులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జులై నుండి ప్రారంభం కానుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఆది లవర్ బాయ్ గా కనిపించనున్నాడు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఆదికు జోడిగా హీరోయిన్ సురభి నటించనున్నారు. అరుణ్ చిలువేరు సంగీతమందిస్తున్న ఈ మూవీలో రావు రమేష్, ప్రియా, రాజీవ్ కనకాల ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరో వైపు తెలుగు సినీ పరిశ్రమలో రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మారుతున్నా విషయం తెలిసిందే. ఆదికు డైమండ్ రత్నబాబు చెప్పిన కథ నచ్చడంతో ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది.