ఢిల్లీ, జూలై 3 : కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్పై నోయిడాలోని రెండు వేర్వేరు మతాలకు చెందిన దంపతులకు పాస్పోర్టు జారీ వ్యవహారం విషయంలో తీవ్ర విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. మంగళవారం ఓ నెటిజన్ దీనిపై మంత్రిని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. దీనికి కేంద్రమంత్రి సుష్మా ఘాటుగా బదులిచ్చారు. సోనమ్ మహజన్ అనే నెటిజన్..'నేను మీకు ఒకప్పుడు అభిమానిని. కానీ ఇప్పుడు మాత్రం దయచేసి నా ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసి నాకు సహాయం చెయ్యండి. దాని కోసం నేను ఎదురుచూస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. దీనికి సుష్మా వెంటనే స్పందించారు. 'ఇంకెందుకు ఆలస్యం.. మిమ్మల్ని బ్లాక్ చేసేశా' అంటూ ట్వీట్ చేశారు.
సుష్మాను ఫాలో అవకుండా తన ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసినందుకు మహజన్ ధన్యవాదాలు తెలిపారు. ఓ హిందు- ముస్లిం జంటకు పాస్పోర్ట్ జారీకి నిరాకరించి వివాదంలో చిక్కుకున్న వికాస్ మిశ్రా అనే అధికారిని బదిలీ చేయడంపై నెటిజన్లు సుష్మాపై విమర్శలు గుప్పించారు. ట్విటర్లో ఆమెను నిందిస్తూ వ్యాఖ్యలు ప్రత్యక్షమయ్యాయి. మతపరమైన కోణం నుంచీ ఆమెపై కొందరు విమర్శలు గుప్పించారు. భాజపా మద్దతుదారులమని చెప్పుకునే పలువురు కూడా సుష్మ నిర్ణయాన్ని తప్పుబడుతూ విమర్శలు గుప్పించారు. కాగా విపక్ష కాంగ్రెస్ ఆమెకు మద్దతు తెలిపిన విషయం తెలిసింది.