చిదంబరం ఇంట్లో చోరి.. కోట్ల విలువైన సొత్తు మాయం..

     Written by : smtv Desk | Sun, Jul 08, 2018, 01:13 PM

చిదంబరం ఇంట్లో చోరి.. కోట్ల విలువైన సొత్తు మాయం..

న్యూఢిల్లీ, జూలై 8 : మాజీ ఆర్ధిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత పి. చిదంబరం ఇంట్లో చోరీ కలకలం రేపుతోంది. నూగంబాక్కంలోని పైక్రాఫ్ట్ గార్డెన్ రోడ్ లో ఉన్న ఆయన ఇంట్లో 1.1 లక్షల రూపాయల నగదుతో పాటు కోట్ల విలువైన సొత్తును చోరీ చేశారు. చిదంబరం భార్య నళినీ చిదంబరం, నెల రోజుల క్రితం ఊటీకి వెళ్ళారు. తిరిగొచ్చి చూసేసరికి ఇంట్లో ఉన్న అల్మరాలు ఓపెన్ చేసి ఉండటం., అందులోని ఆభరణాలు, రూ. 1.50 లక్షల నగదు, ఆరు విలువైన చీరలు దొంగిలించబడినట్లు ఆమె గుర్తించింది.

ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తే, మాస్క్ లు ధరించిన ఇద్దరు ఆడవాళ్లు ఇంట్లోకి వెళుతుండటం కనిపించింది. ఈ ఘటన వెనుక తమ ఇంట్లో పనిచేసే ఇద్దరు పనిమనుషులపై నళినీ చిదంబర౦ అనుమానాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా చిదంబరం ఢిల్లీలో ఉంటున్నారు. వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఆయన కొంత కాలంగా ఇంటికి దూరంగానే ఉన్నారు.





Untitled Document
Advertisements