హైదరాబాద్, జూలై 15 : మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ 'విజేత' సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసి౦దే. జూలై 12న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంను ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్స్టార్ రామ్చరణ్ వీక్షించి.. చిత్ర యూనిట్ ను అభినంది౦చిన విషయం తెలిసిందే. ఇప్పుడా వంతు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు వచ్చింది. చిత్ర విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకను జరపబోతోంది.
ఆదివారం జరగనున్న ఈ చిత్ర విజయోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ రాబోతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను తెలుపుతూ.. చిత్ర యూనిట్ పోస్టర్ను కూడా విడుదల చేసింది. రాకేశ్ శశి దర్శకత్వం వహి౦చిన ఈ చిత్రాన్ని వారాహి సంస్థ బ్యానర్ లో సాయి కొర్రపాటి, రజినీ కొర్రపాటి నిర్మించారు. మాళవిక నాయర్ కథానాయికగా నటించి౦ది. కళ్యాణ్ దేవ్ కు ఇది తొలి చిత్రమే అయినా.. అభిమానుల అంచనాలను అందుకోగలిగాడు. నటన విషయంలో ఏ మాత్రం ఇబ్బంది పడ్డట్లు లేదు. చిరంజీవి అల్లుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం కాబట్టి... ఈ చిత్రంపై అందరికీ ఆసక్తి నెలకొంది.