హైదరాబాద్, జూలై 15 : యూత్ ఫుల్ ఎంటర్టైనర్లతో ఆకట్టుకుంటున్న యువ దర్శకుడు మారుతి.. ఒకవైపు దర్శకుడిగా బిజీగా ఉంటూనే మరోవైపు కొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తు౦టాడు. త్వరలోనే "బ్రాండ్ బాబు" అంటూ ప్రేక్షకులను అలరించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మారుతి సమర్పిస్తున్న ఈ చిత్రానికి బుల్లితెర స్టార్ యాంకర్ పీ ప్రభాకర్ దర్శకత్వం వహిస్తుండగా శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై శైలేంద్ర బాబు నిర్మిస్తున్నారు. జీవన్ బాబు సంగీతం అందించాడు.
ఈ చిత్రం ద్వారా కన్నడ నటుడు సుమంత్ శైలేంద్ర తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఆయన సరసన ఈషా రెబ్బా హీరోయిన్గా నటి౦చనుంది. అలాగే ఈ చిత్రంలో మురళీశర్మ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే ఆడియో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అలాగే ఆగస్టు మొదటివారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.