మెల్ బోర్న్ ఫెస్టివల్ లో 'మహానటి'..

     Written by : smtv Desk | Mon, Jul 16, 2018, 05:14 PM

మెల్ బోర్న్ ఫెస్టివల్ లో 'మహానటి'..

హైదరాబాద్, జూలై 16 : అలనాటి మేటి నటి సావిత్రి జీవితాధారంగా వచ్చిన చిత్రం 'మహానటి'. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా ఆమె భర్త జెమిని గణేశన్‌ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటి౦చారు. ఈ చిత్రంలో సమంత, విజయ్ దేవరకొండ, షాలిని పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నాగ్ అన్వేష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇండియన్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌‌కు నామినేట్‌ అయ్యింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. "మహానటి చిత్రం విదేశాల్లోనూ మంచి ఆదరణ పొందుతున్నందుకు చాలా సంతృప్తికరంగా ఉంది. మా సినిమా మూడు కేటగిరీల్లో ఎంపికైనందుకు గర్వంగా ఉంది" అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి కేటగిరీల్లో ఈ చిత్రం పోటీ పడుతోంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆగస్టు 10 నుంచి ఈ ఫెస్టివల్‌ ప్రారంభం కానుంది.





Untitled Document
Advertisements