కనకదుర్గమ్మను దర్శించుకున్న కార్తి..

     Written by : smtv Desk | Mon, Jul 16, 2018, 06:55 PM

కనకదుర్గమ్మను దర్శించుకున్న కార్తి..

హైదరాబాద్, జూలై 16 : యువ కథానాయకుడు కార్తి.. 'చినబాబు' గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై సూర్య, మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించారు. కార్తి తొలిసారి పూర్తిస్థాయి రైతు పాత్రలో కనిపించి అలరించారు. ఈ నెల 13న తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేసిన ఈ చిత్రం ఘన విజయ సాధించి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పూర్తిస్తాయి ప్యామిలీ ఎంటర్తైన్మెంట్ కు అభిమానులు బాగానే కనెక్ట్ అయ్యారు. సినిమా విజయం సాధించడంతో హీరో కార్తీ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. ఆయనతోపాటు ఈ సినిమా ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సినిమాలో కార్తికి జోడీగా సాయేషా సైగల్‌ నటించారు.





Untitled Document
Advertisements