హైదరాబాద్, జూలై 17 : అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'RX 100' సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. కార్తికేయ, పాయల్ రాజ్పుత్ జంటగా నటించిన ఈ చిత్రంలో రాంకీ, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో దూసుకుపోతోంది. మంచి ప్రేమకథా౦శంతో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. భారీ విజయాన్నే తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా రాణిస్తోందని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. తన సినిమా తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో రూ.10 కోట్లు (గ్రాస్) రాబట్టిందని కథానాయకుడు కార్తికేయ ఆనందం వ్యక్తం చేశారు. సినిమా ఇంకా చక్కగా రాణిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్ను ట్విటర్లో పోస్ట్ చేశారు.