మహేష్ తో మరోసారి..!!

     Written by : smtv Desk | Wed, Jul 18, 2018, 12:21 PM

మహేష్ తో మరోసారి..!!

హైదరాబాద్, జూలై 18 : సూపర్‌ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇటీవల డెహ్రాడూన్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్.. త్వరలో మరో భారీ షెడ్యూల్‌ కోసం ఫారిన్‌ వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉండగా.. మహేష్ తన తదుపరి సినిమా కోసం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సుకుమార్ దర్శకత్వం వహించనున్న సినిమాకి మహేష్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరించనున్న ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి ఇదివరకే 'స్పైడర్' సినిమాలో నటించిన విషయం తెలిసిందే. కాగా కొరటాల శివ దర్శకత్వంలో ఇటీవల రిలీజ్ అయిన "భారత్ అనే నేను" చిత్రం ఘన విజయం సాధించింది. అదే ఊపులో మహేష్ సినిమాలను ఒప్పుకుంటూ బిజీగా గడుపుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం 'స్పైడర్' సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమాకు కూడా సైన్ చేయకపోవడం గమనార్హం.





Untitled Document
Advertisements