అలాంటి వారిని చంపేయాలనిపిస్తోంది..

     Written by : smtv Desk | Wed, Jul 18, 2018, 02:14 PM

అలాంటి వారిని చంపేయాలనిపిస్తోంది..

హైదరాబాద్, జూలై 18 : మంచు లక్ష్మీ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్న వారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంచు లక్ష్మీ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'వైఫ్ ఆఫ్ రామ్'. ఈ చిత్ర ప్రమోషన్ లో పాల్గొన్న మంచు లక్ష్మీ ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తనపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని., అందులో కొన్నింటిని ఎంజాయ్ చేస్తానన్నారు. కానీ నా వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించి నా కుటుంబ పరువు తీసే వాటిని మాత్రం సహించేది లేదని ఫైర్ అయ్యారు. నా ఫోటోలు, వీడియోలు పెట్టి మార్ఫింగ్ చేసే వాళ్లను చెప్పుతో కొట్టాలనిపిస్తోంది. వారికి దమ్ముంటే నా ముందుకు వచ్చి మాట్లాడండి. నా ఫ్యామిలీపై బురద జల్లే విధంగా ప్రచారం చేస్తే సింహంలా మారుతాను. అంతేకాదు వారిని చంపేయాలనిపిస్తోంది. వారిపై ఏమాత్రం పశ్చాత్తాపం పడను' అంటూ మంచు లక్ష్మీ హెచ్చరికలు జారీ చేశారు.





Untitled Document
Advertisements