హైదరాబాద్, జూలై 18 : దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'ఎన్టీఆర్'. భారీ అంచనాల నడుమ మొదలైన ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎన్బీకే ఫిల్మ్స్ పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ విద్యాబాలన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఆమెపై సీన్స్ చిత్రీకరణ ప్రారంభించారు.
అయితే బసవతారకం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే౦దుకు విద్యాబాలన్ బాలకృష్ణ ఇంటికి వెళ్ళింది. అక్కడ బసవతారక౦ గురించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. అయితే తమ ఇంటికి వచ్చిన ఆమెను బాలయ్య, ఆయన భార్య వసుంధర, కుమార్తె తేజశ్విని, అల్లుడు భరత్, సోదరి లోకేశ్వరిలు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విద్యాబాలన్ కు చీరను బహుకరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.